వలసపాలనలోని కళింగాంధ్ర ప్రాంతం ఆ పాలన ముగిసిన తర్వాత మిగతా తెలుగుప్రాంతానికి ముందుచూపునిచ్చింది. ఆ ప్రాంతపు సాహిత్యం, రాజకీయ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలను స్వాతంత్ర్యం తర్వాతి కాలంలో తెలుగు ప్రాంతం ఆదర్శంగా తీసుకున్నది. అయితే మత సంస్కరణ, సంఘ సంస్కరణ రంగాల్లో ఆ ప్రాంతంలో సాగిన కృషి విస్మరణకు గురైంది. గత అరవై ఏళ్లుగా సాంస్కృతిక రంగంలో వేళ్లూనుకున్న పరిణామాలే దీనికి కారణం. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

“కళింగాంధ్ర మాండలిక కోశం” మొదటి భాగం

రచయిత: జి. ఎస్. చలం

కళింగాంధ్ర మాండలిక కోశానికి స్వాగతం

ఇరవయ్యో శతాబ్ది ఆరంభానికి ముందే కళింగ ప్రాంతంలో మాండలిక భాషా విషయాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. మాండలిక సాహిత్యమే వెలసింది. కన్యాశుల్క రూపంలో – ముత్యాలసరాల రూపంలో మొదట ఆ సంచలనాత్మక రచనా ధోరణికి పెద్ద ఎత్తున ప్రతిఘటన మొదలయింది. ఈ జాబు మిగిలిన బాగాన్ని కూడా చదవండి »

Follow

Get every new post delivered to your Inbox.